డేటింగ్ యాప్‌లో పరిచయం.. పబ్‌కు పిలిచి యువకుడిపై దాడి!

ప్రతిపక్షం, జూలై 18: హైదరాబాద్‌లో డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయమైన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఓయూ కాలనీకి చెందిన కళ్యాణ్‌కు డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయమైంది. అనంతరం ఇద్దరూ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో కలుసుకుని మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

బిల్లు తానే చెల్లిస్తానని యువతి చెప్పడంతో కళ్యాణ్ పబ్‌ బిల్లు చెల్లించినట్లు సమాచారం. అనంతరం ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో యువతి, మరికొందరితో కలిసి మాదాపూర్ మెట్రో స్టేషన్ కింద కళ్యాణ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love

Related News

Latest News