Trending Now

యుఎఇ హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌..

ప్రతిపక్షం, స్పోర్ట్స్: భారత మాజీ క్రికెటర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ యుఎఇ పురుషుల క్రికెట్‌జట్టు హెడ్‌ కోచ్‌గా ఎన్నికయ్యారు. యుఎఇ హెడ్‌కోచ్‌గా రాజ్‌పుత్‌ మూడేళ్లు కొనసాగనున్నారు. 1980వ దశకంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 62ఏళ్ల రాజ్‌పుత్‌.. 2016-17లో ఆఫ్ఘనిస్తాన్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవముంది. ఐసిసి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2, వన్డే ట్రై సిరీస్‌లతో పాల్గనే యుఏఇ జట్టుతో కలిసి రాజ్‌పుత్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Spread the love