Trending Now

సెంటిమెంట్ ఆలయంలో నామినేషన్‌పై సంతకాలు చేసిన బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 24: ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వొస్తున్నా.. కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షి గా ప్రమాణంగా చెబుతున్న గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ ఆలయం నంగునూరు మండలంలోని కొనాయపల్లి శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామి వారి వద్ద నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావులతో పాటు మెదక్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థి గా బరిలో నిలవడం జరిగిందన్నారు. కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ నాకు రాజకీయ జీవితం ఇవ్వాలని కోరారు. మాట తప్పే మనిషిని కాదని, స్వామి వారి సాక్షిగా ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ యువకులకు అండగా నిలుస్తామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love

Related News