ప్రతిపక్షం, జూన్ 12: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలు, రానున్న ఎన్నికలకు సంబంధించిన అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాలను ఉద్ధృతం చేయడం, కేడర్లో ఉత్సాహం పెంపొందించే చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

















