Trending Now

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే శంకర్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జీవన్ రెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్ రాజ్ గౌడ్, రఘ, సీతారాం, ముబారక్, తుపాకుల శేఖర్ తదితరులు ఉన్నారు.

Spread the love

Latest News