Trending Now

సందేశ్‌ఖాలీ వివాదం.. టీఎంసీ నేత అరెస్టు

ప్రతిపక్షం, నేషనల్: పశ్చిమ బెంగాల్‌ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్ ఖాలీలో లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత అజిత్ మైతీని పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రముఖ నిందితుడిగా భావిస్తున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్ సన్నిహితుడైన అజిత్‌కు వ్యతిరేకంగా ఆదివారం పలువురు మహిళలు నిరసన తెలిపారు. అజిత్ భూకబ్జాలు, దోపిడీకి పాల్పడ్డాడని అతనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనను టీఎంసీ నుంచి పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. సందేశ్ ఖాలీ ప్రాంతంలో టీఎంసీ కీలక నేత షాజహాన్, అతని మద్దతుదారులపై భూకబ్జా, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సందేశ్ ఖాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Spread the love