ప్రతిపక్షం, తెలంగాణ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. మార్చి 13న విచారణ చేపడుతామని తెలిపింది. తనను ఈడీ ఆఫీస్లో కాకుండా ఇంటి వద్దే విచారించాలని కోరుతూ.. ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.