Trending Now

త్వరితగతిన మూసీ అభివృద్ధి.. అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మూసీ నది పరివాహక ప్రాంతాన్ని త్వరిత గతిన అభివృద్ధి చేయాలని, ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సోమవారం నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్​ సమీక్షించారు. సమీక్ష. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు అధికారులు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులను రేవంత్​రెడ్డి ఆదేశం.

నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి దానం కిషోర్​ను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి అధికారులు, టౌన్​ప్లానింగ్​అధికారులతో పాటు సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Spread the love