Trending Now

ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. రిషభ్ పంత్ వచ్చేస్తున్నాడు..?

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ IPL 2024లో ఆడనున్నట్లు తెలుస్తోంది. NCA అతడి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను BCCIకి అందించినట్లు సమాచారం. దీంతో అతడు ఐపీఎల్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ క్యాంప్‌లో పంత్ పాల్గొననున్నట్లు టాక్. కాగా యాక్సిడెంట్ కారణంగా పంత్ ఏడాదికిపైగా క్రికెట్‌కు దూరమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు బ్యాట్ పట్టనున్నారు.

Spread the love