Trending Now

ధోనీ రికార్డును సమం చేసిన జడేజా..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలకపాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జడేజా నాలుగు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి కీలక మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ క్రమంలో జడేజా అరుదైన ఘనత సాధించాడు. CSK తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సరసన జడ్డూ నిలిచాడు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15సార్లు ఈ అవార్డు సాధించారు.

Spread the love

Related News