హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ!

ప్రతిపక్షం, జూన్ 09: గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ విల్లాలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. వ్యాపారవేత్త ఇంట్లో భద్రపరిచిన సుమారు కేజీ బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలు గుర్తుతెలియని వ్యక్తుల చేతికి చిక్కాయి.

కుటుంబ సభ్యులు నగరానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వస్తువులు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఇటీవల ఇంటి పనుల కోసం నియమించుకున్న దంపతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

Spread the love

Related News

Latest News