Trending Now

నేడే IPL 2024 ఆరంభం.. తొలి మ్యాచ్‌లో చెన్నై vs ఆర్సీబీ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2024 సరికొత్తగా సిద్ధమైంది. నేటి నుంచి ఈ టోర్నీకి తెరలేవనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందే సాయంత్రం 6.30 గంటలకు ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, ఎఆర్‌ రెహ్మాన్‌, సోనూ నిగమ్‌ పెర్ఫార్మ్‌ చేయబోతున్నారు. తొలి మ్యాచ్‌ ఇవాళ చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ టీమ్స్ మధ్య జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌ నేటి రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.

సీఎస్‌కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం​ ఆటకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు అని చెప్పింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం నాడు రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్‌ జరిగే సమయంలో (7- గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనింది. అయితే, చెపాక్‌ పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండిటికీ అనుకూలిస్తుంది.. అలాగే, మొదట బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్‌ క్రమంగా స్నిన్‌కు అనుకూలింది. ఈ పిచ్‌పై టార్గెట్ ఛేదించడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసే టీమ్ కే విజయావకాశాలు ఉంటాయి.

అలాగే, ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన చెన్నైకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు పోటీ పడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించగా.. ఓ మ్యాచ్‌లో టై అయింది. ఆర్సీబీపై సీఎస్‌కే పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది.. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో ఏకంగా సీఎస్కే ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆర్సీబీ గెలిచింది. చూడాలి మరి ఈరోజు విజయం ఎవరిని వరిస్తుందో..!

Spread the love