Trending Now

బీజేపీ‌కి బిగ్ షాక్.. సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ సంచలన నిర్ణయం

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. 400 సీట్లతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్న ఆ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. దీంతో టికెట్ దక్కని కొందరు అసమ్మతి నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆ నేపథ్యంలో మరికొందరు పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ ప్రకటించారు. బీజేపీ అధిష్టానం విడుదల చేసిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడం బాధించిందని.. అందుకే తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు.

Spread the love