Trending Now

హిమాచల్‌ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరి మృతి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హోలీ పండుగ రోజున హిమాచల్ ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్‌లోని మేడిలో హోలీ సంబరాలు జరుగుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ఉన్నవారు భయపడి పరుగెడుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Spread the love