Trending Now

కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాం ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి అన్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ప్రజలను మబ్బే పెట్టి దృష్టి మళ్లించి.. వారి నుంచి ఓట్లు దండుకోవడానికి ఎంతకైనా దిగజారుతారని మరొకసారి బి.జె.పి, బి.ఆర్.ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బూటకపు అరెస్టు చేసి నిరూపించుకున్నాయని ఆయన మండిపడ్డారు. బి.జె.పి పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ స్కామ్ లో దోషిగా నిరూపించబడినటువంటి కల్వకుంట్ల కవితను ఎన్నడో అరెస్టు చేసి జైల్లో పెట్టి ఉండే వారిని ఇదంతా కేవలం బి.జె.పి, బి.ఆర్.ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అని పేర్కొన్నారు.ప్రజలకు అంతా తెలుసు అని ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే ఎంపీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బి.జె.పి, బి.ఆర్.ఎస్ పార్టీలకు చెంప చెల్లుమనే విధంగా సమాధానం ఇస్తారన్నారు.

Spread the love