Trending Now

కాంగ్రెస్​లోకి బీజేపీ సీనియర్​నేత..

జీతేందర్​రెడ్డితో భేటీ అయిన జిల్లా ఎమ్మెల్యేలు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్​నేత ఏపీ జితేందర్​రెడ్డి కాంగ్రెస్​పార్టీలో చేరే విషయం దాదాపుగా ఖాయం అయినట్లు సమాచారం. మహబూబ్​నగర్​ లోక్​సభ టికెట్​ ఆశించిన ఆయనకు ఆ పార్టీ టికెట్​ ఇవ్వలేదు. గతంలో బీఆర్​ఎస్​ సైతం ఆయనకు టికెట్​ నిరాకరించింది. ఎన్నికల అనంతరం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయనకు టికెట్​ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న ఆయనను సీఎం రవేంత్​రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మహబూబ్​నగర్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఇటీవల గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలందరూ జితేందర్​రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీ పాలమూరు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గత అయిదేళ్లు, మళ్లీ అయిదేళ్లు ఇలా ఉత్తగ ఉంటే రాజకీయ భవిష్యత్​ ఏమిటన్న దానిపై ఆయన సమాలోచనల్లో పడ్డారు. దీంతో కాంగ్రెస్​లో చేరాలని ఆయన అనుచరులు కోరుతున్నారని, త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

Spread the love