Trending Now

యాదాద్రీశుడి చెంతన.. దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం..!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఆగ్రహం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: యాదాద్రీశుడి చెంతన దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని టీఆర్​ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో కార్పొరేషన్​ మాజీ చైర్మన్లు దేవీ ప్రసాద్​, వాసుదేవ రెడ్డితో కలిసి బాల్కసుమన్​ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఆగ్ర వర్ణాలకు చెందిన రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చోబెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖనుకింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి?… ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కనే అవమానించారన్నారు.74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందన్నారు. యావత్ దళిత జాతిని ఈరోజు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి భట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారని…. ప్రభుత్వ యాడ్స్‌లో డిప్యూటీ సీఎం ఫోటోను పక్కన పెట్టారన్నారు. జరిగిన ఘటనపై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విసూనురి రామచంద్ర రెడ్డి లాంటి వాడు రేవంత్ రెడ్డి అని… భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హైకామండ్ స్పందించాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని బాల్క సుమాన్ డిమాండ్ చేశారు.

Spread the love