Trending Now

రేపు నిర్మల్ కు ప్రోఫెసర్ కోదండరాం..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ లోని పెన్షనర్ల సంఘ భవనంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రేపు ‘ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ ల సమస్యలు – ప్రభుత్వ విధానాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహంచనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య​అతిథిగా ప్రోఫెసర్. కోదండరాం హాజరుకానున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్సనర్లు, రైతులు, కార్మికులు, ప్రజలు హాజరు కావల్సిందిగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి TPJAC చైర్మన్ ఆరెపల్లి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love