Trending Now

చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. తొలి క్రికెటర్‌గా..

ప్రతిపక్షం, స్పోర్ట్స్: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో 3,000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. పీఎస్‌ఎల్‌-2024 సీజన్‌లో భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద.. బాబర్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఆజం ఇప్పటివరకు 78 ఇన్నింగ్స్‌లలో 3,003 పరుగులు చేశాడు. బాబర్‌ తర్వాత పాక్‌ ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌(2381) ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 16 పరుగుల తేడాతో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్‌ విజయం సాధించింది.

Spread the love