ప్రతిపక్షం, జూలై 17: చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి రూ.50 వేల వరకు రుణం అందిస్తారు. ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి రూ.5 లక్షల వరకు, వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణాలకు సాధారణంగా ఎలాంటి పూచీకత్తు లేదా గ్యారంటీ అవసరం ఉండదు. రుణం కోసం వ్యాపార ప్రణాళిక, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, గత కొన్ని నెలల బ్యాంకు ఖాతా వివరాలతో బ్యాంకులను సంప్రదించవచ్చు.

















