ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. అంతకు ముందు 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో క్రాలే 61* ఉన్నాడు.