ప్రతిపక్షం, జూలై 04: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2006 జులై 4న మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రాజకీయాల్లో తొలి అడుగు వేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్లో పర్యటించనున్నారు. సుమారు రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అంతకుముందు నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

















