Trending Now

మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నాం : మాజీ మంత్రి హరీశ్ రావు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదని.. కనీసం ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదని మండిపడ్డారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. కన్నీళ్లే మిగిలాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలి. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి అని అన్నారు.

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని.. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తుకెక్కాయి. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్నడు కోమటిరెడ్డి. మీతో చెప్పుతో కొట్టించుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది.? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదని.. కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చింది తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారన్నారు. మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదు. రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Spread the love

Related News