Trending Now

మెదక్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌దే..

బీజేపీ, బీర్ఎస్ ప్రజావ్యతిరేక పార్టీలే..

డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 20: బీజేపీ, బీఆర్ఎస్ రెండు ప్రజా వ్యతిరేక పార్టీలేనని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని డిసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ కీ వెళుతూ మెట్టుబడ్డల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీర్ఎస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టె ప్రతి పథకాన్ని, మ్యానిఫెస్టోను ప్రజలవద్దకు, గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తదన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాములు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉడుత జయంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, సెక్రటరీ కోరిమి రాజు, యూత్ సెక్రటరీ మాసం శేషు, nsui మండలం సెక్రటరీ గుంజే రాజేందర్, జగన్, బత్తల మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నముండ్ల వినోద్, రాజిరెడ్డి, సత్యనారాయణ, పిల్లి బాబు, శ్రీకాంత్, ప్రశాంత్, అజయ్, నక్క రాజు, దామోదర్ రెడ్డి,భాస్కర్, రాజు, అల్లీపూర్ గ్రామ అధ్యక్షులు మీసం రాజు చెర్లంకిరెడ్డి పల్లి గ్రామ అధ్యక్షులు వెంకట్, రాజు, కోర్రి శంకర్, మంకాళి మల్లేశం, కోడెల నాగరాజు, బోయ మల్లయ్య సిద్దుల కుమార్ స్వామి, తాళ్ల రాజు, మహేష్, శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News