Trending Now

ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

99.86 శాతం పోలింగ్‌ నమోదు

కొడంగల్​లో ఓటు వేసిన సీఎం రేవంత్​రెడ్డి

ఏప్రిల్​ 2న ఓట్ల లెక్కింపు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్​లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఓటు వేశారు.

నాగర్‌కర్నూలు,నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్‌ 2వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తిలో ఎమ్మెల్సీగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పారిశ్రామిక వేత్త మన్నె జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థుల మధ్య రసవత్తరంగా పోటీ నెలకొంది. ఎన్నికల్లో భారీ ఎత్తున క్రాస్​ ఓటింగ్​ జరిగిందని, దీంతో కాంగ్రెస్​ అభ్యర్థి మన్నె జీవన్​రెడ్డికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా బీఆర్​ఎస్​కు చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉన్నారని వారంతా బీఆర్​ఎస్​ అభ్యర్థికే ఓటు వేశారని, దీంతో బీఆర్ఎస్​ అభ్యర్థి గెలుస్తాడని బీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు.

Spread the love