Trending Now

ఎంపీగా ఉమ్మడి ఏపీ చివరి సీఎం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఈసారి ఆయన పార్లమెంటు రణక్షేత్రంలో అడుగుపెడుతోన్నారు. చాలా రోజుల క్రితమే ఆయన కమలం పార్టీలో చేరినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయం చేయలేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనకు ఆ పార్టీ రాజంపేట ఎంపీ టికెట్‌ను కేటాయించింది. మరి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మాజీ సీఎం ఎంపీగా గెలుస్తారో లేదో చూడాలి.

Spread the love