ప్రతిపక్షం, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాసేపటి క్రితమే యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.