Trending Now

లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈ నెల 30తో నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 19న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Spread the love