Trending Now

బెట్టింగ్ యాప్ కుంభకోణం.. మాజీ సీఎంపై కేసు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌పై కేసు నమోదైంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు రూ.508 కోట్ల మేర ఇచ్చినట్లు గతంలో ఆరోపించిన ఈడీ.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీ నమోదు చేసిన రాజకీయ వేధింపు కేసు అని బఘేల్ ఆరోపించారు.

Spread the love

Latest News