Trending Now

మరాఠాలకు10 శాతం రిజర్వేషన్ బిల్లు.. మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం

ప్రతిపక్షం, నేషనల్: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య అవకాశాల్లో మరాఠాలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లును ఆమోదించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. ఈ మేరకు జరాంగే మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఇతర రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయకుండా తమ ప్రభుత్వం మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తుందని సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. సునీల్ షుక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌ను పొడిగించారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఈడబ్లూఎస్10 శాతం కోటాను కలిగి ఉండగా..ఇందులో మరాఠాలు అత్యధిక లబ్ధిదారులుగా ఉన్నారు. అంతేగాక ఇప్పటికే రాష్ట్రంలో 52శాతం రిజర్వేషన్లు అమలులో ఉండగా.. తాజా మరాఠా కోటా10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 62 శాతానికి చేరుకోనున్నాయి.

Spread the love