Trending Now

ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్‌బీఐ విజ్ఞప్తి తిరస్కరణ..

ప్రతిపక్షం, ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నిక కమిషన కు సమర్పించేందుకు గడువును పొడిగించాలన్న ఎస్బీఐ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందు నిర్ణయించిన ప్రకారం రేపు (12 వ తేదీ) బాండ్ల వివరాలను అందచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఆ వివరాలను అందుకున్న ఎన్నికల సంఘం వాటిని ఈ నెల 15వ తేదీన పనివేళలు ముగిసేలోగా తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచాలని కూడా ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం గత నెల 15న ఈ బాండ్లను రద్దు చేసింది.

Spread the love