ప్రతిపక్షం, వెబ్డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యాసిడ్ దాడి బాధితులను కలిశారు. బిజీ షెడ్యూల్లోనూ ఆమె అతిజీవన్ ఫౌండేషన్కు వచ్చారని సామాజిక కార్యకర్త ప్రగ్యా ప్రసూన్ తెలిపారు. యాసిడ్ విక్టిమ్స్తో ప్రియాంక మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. వారితో ఆమె దిగిన ఫొటోలను ప్రగ్యా ఇన్స్టాలో పంచుకున్నారు. బాధితుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముందుకొచ్చినందుకు ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు.