Trending Now

భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: సైబరాబాద్‌లో ఎస్‌వోటీ చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం సైబరాబాద్‌లో ఎస్‌ఓటీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 4.4 కేజీల గంజాయి, ఎల్‌ఎస్‌డీ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేసి డ్రగ్స్, గంజాయిని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. అల్లాపూర్‌లో 1.9 కేజీల గంజాయిని ఎస్‌ఓటీ స్వాధీనం చేసుకుంది. అలాగే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను పట్టుకున్నారు. అత్తాపూర్‌లోని డీమార్ట్ వద్ద ఆటోలో పెట్టుకొని గంజాయి అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి 2010 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. నాలుగు కేసుల్లో ఐదు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love