Trending Now

నిర్మల్‌లో ఉపాధి హామీ కూలి మృతి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 9 : ఉపాధి హామీ పనులకని వెళ్లిన ఓ కూలిని సూర్య ప్రతాపం రూపంలో వచ్చిన ఎండ వేడిమి బలితీసుకుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మండలంలో ని ఓసీ గ్రామానికి చెందిన సర్వార్ విట్టల్ (60 )బుధవారం ఉదయం కూలీలతో కలిసి ఉపాధి పనులకు వెళ్ళాడు. పనులు ముగించుకొని ఇంటికి తిరిగి రాగా.. తీవ్రంగా అస్వస్థతకు గురై కుప్పకూలాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే విఠల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనాలు మిన్నంటాయి. ఈ మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం తానూరు మండల జిల్లా, స్థాయి అధికారులకు స్థానిక మెట్లు విఠల్ మృతి చెందిన సమాచారాన్ని అందించారు.

Spread the love

Related News