Trending Now

శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజస్థాన్‌లోని కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుదాఘాతంతో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఎంబీఎస్ ఆసుపత్రిలో చేర్చారు. తదుపరి చికిత్స కోసం జైపూర్ తరిలిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్, కోట ఎంపీ ఓం బిర్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులను తగిన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

Spread the love

Latest News