Trending Now

బీఆర్​ఎస్​కు బిగ్ షాక్.. ​వరంగల్​ ఎంపీ పార్టీకి గుడ్​బై!

సీఎం రేవంత్​తో భేటీ అయిన పసునూరి దయాకర్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: బీఆర్​ఎస్​ కు పార్టీ నేతలు షాక్​ ఇస్తూనే ఉన్నారు. గత పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్​ఎస్​కు లోక్​సభ ఎన్నికల సమయంలో తలబొప్పిగా మారింది. ఇప్పటికే ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఈనెల 17న కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్​ ఎంపీ పసునూరి దయాకర్​ సీఎం రేవంత్​తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్​ పార్టీ టికెట్​ ఆయనకు ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్​లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Spread the love