Trending Now

రెవిన్యూ శాఖలో కలకలం..

ముగ్గురు తహశీల్దార్ల అక్రమాలపై వేటు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యూటేషన్ విషయంలో గజ్వేల్ తహసీల్దార్ శ్రీనివాస్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది. మరోవైపున వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అమెరికాలో నివసిస్తున్న వారి పట్టాదారుతో సంబంధం లేకుండానే భూ విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో ధరణిలో పేరు మార్పిడి చేశారు. దీంతో ఆపరేటర్ పై నమ్మకం ఉంచి తాను తొందరపడి ఇలా చేశానన్నారు తిరుమల్ రావు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అంతకు ముందే వీణవంకలో ఓ గ్రామానికి చెందిన ఫ్యామిలీకి మెంబర్టిఫికెట్ ఇచ్చిన సిబ్బందిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

Spread the love