Trending Now

హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్ని అధికారులు పొడిగించారు. రాత్రి వేళల్లో ప్రస్తుతం 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి అది 11.45 వరకు నడుస్తుంది. ఇక ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభమవనున్నాయి. మిగిలిన రోజుల్లో ఆరింటి నుంచే నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో అధికారులు మార్పులు చేశారు. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు.

Spread the love

Related News