Trending Now

దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది

మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

ప్రతిపక్షం, దుబ్బాక, మే 8: దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బుధవారం ధౌల్తాబాద్ కార్నర్ మీటింగులో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీ కనుక మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, ఉద్యోగాలలో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో? ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు. దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న బిజెపి ఈసారి అధికారంలోకి వస్తే ధరలు ఆకాశాన్ని అంటుతాయని తెలిపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, ఉపాధి కూలీలందరికీ మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఉపాధి కూలీలందరికీ 365 రోజులు పని కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అలాగే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న వారు ఇందిరమ్మ హాయంలో ఇండ్లు, భూములు, పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి బాటలు వేసిన విషయాలను గుర్తించుకోవాలన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని సూచించారు. తనను ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ, ఎంపీ నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకు ముందు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నీలం మదు ముదిరాజు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం పి టి సి ఆది వేణు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల సోమేశ్వర్ర్ రెడ్డి, మామిడి మోహన్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

Spread the love

Related News