ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 9 : నిర్మల్ జిల్లాలోని దోస్తునగర్ తండాలో అక్రమంగా నిల్వ ఉంచి.. విక్రయిస్తున్న 1400 కిలోల నల్ల బెల్లం, 62 కిలోల పట్టిక (ఆలం)ను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి అక్రమంగా కొన్ని నెలలుగా శంకర అనే వ్యక్తి నల్ల బెల్లం పట్టికలను విక్రయిస్తున్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా అక్రమంగా నల్ల బెల్లం, పట్టిక ల అక్రమ క్రయ, విక్రయాలు జరిపితే తమకు రహస్యంగా సమాచారం అందించాలని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు. నల్ల బెల్లం, పట్టిక క్రయవిక్రయాలు చట్ట విరుద్ధమని ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, తమకు సహకరించాలని పోలీసులు కోరారు.