ప్రతిపక్షం, జూలై 19: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నమోదవుతున్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 వేరియంట్ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ సోకిన వారిలో కనిపించే సాధారణ లక్షణాలను వెల్లడించారు.
గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ లక్షణాలు సాధారణ కరోనా లక్షణాలేనని, ప్రస్తుతం గుర్తించిన ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 వేరియంట్ ప్రమాదకరమైనదిగా కనిపించడం లేదని తెలిపారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.
















