ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించడంతో ఇంగ్లండ్ విలవిలలాడుతోంది. కుల్దీప్ ఏకంగా ఐదు వికెట్లతో ఇంగ్లీష్ జట్టును కోలుకోని దెబ్బ తీశాడు. ఈ మ్యాచులో తొలి రోజు ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున ఇప్పటి వరకు కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, అశ్విన్ నాలుగు, జడేజా ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరూ అద్భుతంగా ఆడి బ్యాటింగ్ చేశారు. జాక్ క్రాలే 79 రన్స్ చేయగా, బెన్ డకెట్ 27, జానీ బెయిర్స్టో 29 పరుగులు చేశారు.