Trending Now

బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 16 : భారత్ రాష్ట్ర సమితికి కోలుకొని దెబ్బలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ చక్రం తిప్పిన జాతీయ నాయకుడు.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సన్నిహిత్యంగా ఉండే రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనేక పర్యాయాలు నిర్మల్ శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా,ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వేణుగోపాల చారి తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక భూమిక పోషించారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు,పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వేణుగోపాలాచారి సుమారు రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకత్వంతో రహస్య చర్చలు జరిపి మంగళవారం తన అనుచరులతో కలిసి నేరుగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చే కాంగ్రెస్ కండువా వేసుకొని కాంగ్రెస్ లో చేరారు. అయన తో పాటు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News