ప్రతిపక్షం, జూన్ 24: నీట్ పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు కేంద్ర మంత్రులు, అధికారులు, సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరీక్ష నిర్వహణలో భాగమైన ప్రతి ఒక్కరి కృషిని ప్రశంసించారు.
పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం సంతోషకరమని పేర్కొన్న ప్రధాని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు.
గతంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దైన నీట్ పరీక్షను ఈ నెల 21న దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించారు. ఈ పునఃపరీక్షకు సుమారు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

















