Trending Now

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ధాన్యం కొనుగోళ్లు, సి ఎం ఆర్ సరఫరా తదితర అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని తెలిపారు. అవసరమైన చోట ధాన్యం మిల్లులకు తరలింపుకు అదనపు లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పా లీన్లు, టెంట్లు, త్రాగునీరు వంటి సౌకర్యాలు కాల్పించాలని ఆదేశించారు. ప్యాడీ క్లీనింగ్ యంత్రాల ద్వారా వరి ధాన్యాన్ని శుభ్రపరిచే విధంగా చూడాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో కేంద్రాలను పరిశీలించి రోజూ వారి రిపోర్టులను సమర్పించాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మిలర్ల వారిగా లక్ష్యం, సరఫరా, పెండింగ్ పై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీఎస్ వో నందిత, డీఎం సివిల్ సప్లైయిస్ శ్రీకళ, డీసీవో నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, మార్కెటింగ్ ఏడీ అశ్వాక్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News