అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌కు మంత్రి హోదా.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌కు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారికి మంత్రి హోదాకు సంబంధించిన ప్రోటోకాల్ అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏప్రిల్‌లో అప్పటి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరిట సిద్ధం చేయగా, తాజాగా అధికారికంగా విడుదల చేశారు. పార్టీ కోసం తొలి నుంచి పనిచేసిన ఇద్దరు నేతలకు తగిన గుర్తింపు లభించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Spread the love

Related News

Latest News