Trending Now

మళ్లీ శూన్యం నుంచి సునామి సృష్టిస్తాం: కేటీఆర్​

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు.. ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్‌దని చెప్పారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏండ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని పేర్కొన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తామని.. పోరాట పంథాలో కదం తొక్కుతామని స్పష్టం చేశారు.

Spread the love

Latest News