Trending Now

‘రహదారులకు నిధులివ్వండి’.. నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ప్రతిపక్షం ప్రతినిధి: తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి దిల్లీలో మంగళవారం బిజీ.. బిజీగా గడిపారు. ఈ క్రమంలోనే రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లై ఓవర్ల అంశాలపై కేంద్రమంత్రితో సుమారు గంటపాటు చర్చించారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ప్రధాన రహదారులు, రీజనల్​ రింగ్​ రోడ్డు సహా పలు అంశాలపై సుమారు గంటపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు భువనగిరి రహదారి, సిర్పూర్‌ – కాగజ్‌నగర్‌ నేషనల్​ హైవే, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరో చోటికి మార్పు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్​ రెడ్డి కోరినట్లు సమాచారం. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రేవంత్​ ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. బకాయిలు సహా వివిధ రూపాల్లో వచ్చే గ్రాంట్​లను పొందేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక విజ్ఞాపన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love