ప్రతిపక్షం, వెబ్డెస్క్: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ.. టీఎస్ఆర్ టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో జరగబోయే మ్యాచ్ కోసం 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు దీనికి సంబందించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇవ్వాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎస్ మ్యాచ్ కు మీ సోంత వాహానాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి అని సూచించారు.
క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024