Trending Now

ఎంబీఏ విద్యార్థిని సూసైడ్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ములుగు జిల్లాకు చెందిన సాహితీ(26) హాస్టల్‌ రూమ్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని మృతిపై పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

hyd suicide of mba student in dilsukhnagar

Spread the love